• English
    • లాగిన్ / నమోదు

    E20 ఇంధనం వల్ల మైలేజ్ తగ్గుతుందా? Mahindra, Toyota, And Mercedes-Benz ఏమంటున్నాయంటే...

    మైలేజ్‌పై ఆందోళనల మధ్య E20 పెట్రోల్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై కార్ల తయారీ సంస్థలు ఏమంటున్నాయో తెలుసుకుందాం.

    tirth
    tirth
    Published On జూలై 15, 2026 11:44 ist
    info icon
    published onJul 15, 2026 11:44 IST
    last updated onJul 15, 2026 11:44 IST
    56 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    E20 Fuel Affect Mileage

    భారత్‌లో E20 ఇంధనానికి మార్పు ఎలాంటి హడావుడి లేకుండా జరిగిన విషయం కాదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకుల్లో 20 శాతం ఎథనాల్ మిశ్రమంతో కూడిన ఇంధనాన్ని తప్పనిసరిగా విక్రయిస్తున్నప్పటికీ, వాహన యజమానుల్లో పనితీరు, మైలేజ్, ముఖ్యంగా తమ కార్ల దీర్ఘకాలిక ఆరోగ్యంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. అయితే E20 పెట్రోల్ నిజంగానే కారు మైలేజ్‌ను తగ్గిస్తుందా? ముందుగా దీన్ని తెలుసుకుని, ఆ తర్వాత దీనిపై ఆటోమొబైల్ తయారీ సంస్థలు ఏమంటున్నాయో చూద్దాం. 

    ముందుగా... E20 పెట్రోల్ నిజంగా మైలేజ్‌పై ప్రభావం చూపుతుందా?

    సులభంగా చెప్పాలంటే... అవును, కొంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉంది.

    E20 పెట్రోల్‌లో 20 శాతం ఎథనాల్, 80 శాతం పెట్రోల్ ఉంటుంది. సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే దీనిలో లీటరుకు ఉండే శక్తి (ఎనర్జీ కంటెంట్) స్వల్పంగా తక్కువగా ఉంటుంది. దీంతో అదే దూరం ప్రయాణించేందుకు కొంచెం ఎక్కువ ఇంధనం వినియోగించాల్సి వస్తుంది. ఫలితంగా వాహనం అదే దూరానికి కొద్దిగా ఎక్కువ ఇంధనాన్ని ఖర్చు చేస్తుంది.

    Supreme Court Rejects PIL Against E20 Petrol

    పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ ప్రకారం, స్వచ్ఛమైన పెట్రోల్‌తో పోలిస్తే E20 ఇంధనాన్ని ఉపయోగించినప్పుడు కొన్ని వాహనాల్లో 3 నుంచి 5 శాతం వరకు మైలేజ్ తగ్గే అవకాశం ఉంది. అయితే వాస్తవ పరిస్థితుల్లో మైలేజ్ అనేది డ్రైవింగ్ తీరు, టైర్లలో గాలి ఒత్తిడి, క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించడం, ఎయిర్ కండీషనర్ వినియోగం వంటి అనేక అంశాలపై కూడా ఆధారపడి ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కాబట్టి మైలేజ్‌లో స్వల్ప తగ్గుదలకు E20 కారణమవుతుండొచ్చు. అయితే E20 వినియోగం ప్రారంభించిన తర్వాత మైలేజ్‌లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తే, మీ కారును తప్పనిసరిగా సర్వీస్ సెంటర్‌లో తనిఖీ చేయించుకోవాలని సూచిస్తోంది. 

    మహీంద్రా ఏమంటోంది? E20పై తమ పెట్రోల్ కార్లు సురక్షితంగానే నడుస్తాయని స్పష్టం

    E20 పెట్రోల్ వినియోగంపై Mahindra అధికారికంగా వివరణ ఇచ్చింది. కంపెనీ తన ప్రకటనలో… "మహీంద్రాలో మా వాహనాల భద్రత, విశ్వసనీయత, పనితీరు మాకు అత్యంత ప్రాధాన్యం. E20కు అనుకూలంగా రూపొందించిన మా అన్ని పెట్రోల్ వాహనాలను E20 ఇంధనంతో విస్తృతంగా పరీక్షించాం. ఈ మార్పుకు మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. దేశంలో ఇంధన భద్రత, పర్యావరణ పరిరక్షణ దిశగా E20 మార్పు ఒక కీలక అడుగు. ఈ మార్పుకు బాధ్యతాయుతంగా మద్దతు ఇవ్వడానికి మహీంద్రా కట్టుబడి ఉంది. మాపై మీరు ఉంచుతున్న విశ్వాసానికి ధన్యవాదాలు." అని పేర్కొంది.

    Mahindra E20 Statement

    అయితే పనితీరు, ఇంధన సామర్థ్యం మధ్య ఒక ముఖ్యమైన తేడా ఉందని మహీంద్రా స్పష్టం చేసింది. 2025 ఏప్రిల్ 1 తర్వాత తయారైన మహీంద్రా పెట్రోల్ వాహనాలను E20 ఇంధనానికి అనుగుణంగా ప్రత్యేకంగా క్యాలిబ్రేట్ చేసినట్లు తెలిపింది. ఈ వాహనాలు కొత్త ఇంధన మిశ్రమంతో మెరుగైన యాక్సిలరేషన్, ఇంధన సామర్థ్యాన్ని అందించేలా ట్యూన్ చేసినట్లు పేర్కొంది. పాత మహీంద్రా పెట్రోల్ వాహనాల్లో కూడా E20 పెట్రోల్‌ను సురక్షితంగా ఉపయోగించవచ్చని, అయితే డ్రైవింగ్ శైలి, పరిస్థితులను బట్టి యాక్సిలరేషన్ లేదా ఇంధన సామర్థ్యంలో స్వల్ప మార్పులు కనిపించే అవకాశం ఉందని వెల్లడించింది.

    Mahindra Thar Roxx colours

    E20 వినియోగం సురక్షితమే అయినప్పటికీ, మైలేజ్‌పై వాస్తవ ప్రభావం ఇంజిన్‌ను E20కు ఎంత సమర్థంగా ట్యూన్ చేశారన్నదానిపై ఆధారపడి ఉంటుందని ఒక ఆటోమొబైల్ తయారీ సంస్థ నేరుగా అంగీకరించడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు.

    మెర్సిడెస్-బెంజ్ ఏమంది?

    Mercedes-Benz ఇండియా కూడా E20 పెట్రోల్‌పై అధికారిక కస్టమర్ సలహాను విడుదల చేసింది.

    Mahindra E20 Statement

    కంపెనీ ప్రకటనలో... "మెర్సిడెస్-బెంజ్‌లో కస్టమర్ల భద్రత, వాహనాల విశ్వసనీయత, పనితీరుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాం. BS VI ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న మా అన్ని పెట్రోల్ వాహనాలు E20 ఇంధనానికి మెటీరియల్ పరంగా అనుకూలమైనవి. సంబంధిత అధికారుల నుంచి కూడా వీటికి ధ్రువీకరణ లభించింది." అని పేర్కొంది.

    S-Class E20

    అలాగే E20కు సంబంధించిన సాంకేతిక సందేహాలపై వినియోగదారులకు సహాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, సుస్థిర రవాణా లక్ష్యానికి కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేసింది.

    2009 నుంచే హోండా కార్లు E20కు అనుకూలం!

    ఇది ఆసక్తికరమైన విషయం. 2009 జనవరి 1 నుంచి భారత్‌లో తయారైన అన్ని Honda కార్లు E20 "మెటీరియల్ కంపాటిబుల్" అని హోండా కార్స్ ఇండియా ప్రకటించింది. అయితే మెటీరియల్ కంపాటిబుల్ కావడం, E20 క్యాలిబ్రేటెడ్ కావడం రెండూ వేర్వేరు అంశాలు. మెటీరియల్ కంపాటిబుల్ అంటే ఇంధన పైపులు, సీల్స్, ఇతర భాగాలు ఎథనాల్ మిశ్రమం వల్ల దెబ్బతినకుండా ఉండేలా రూపొందించబడినట్లు అర్థం. అంటే ఈ వాహనాల్లో ఎలాంటి హార్డ్‌వేర్ మార్పులు చేయాల్సిన అవసరం లేకుండా, మెటీరియల్ అనుకూలతపై ఆందోళన లేకుండా E20 పెట్రోల్‌ను ఉపయోగించవచ్చు.

    Honda Elevate

    భారత్‌లో అమలవుతున్న ఎథనాల్ మిశ్రమ విధానానికి అనుగుణంగా, హోండా తన ప్రస్తుత మోడళ్లన్నింటినీ 2025లో పూర్తిగా E20 ప్రమాణాలకు అనుగుణంగా మార్చింది.

    వైరల్ అయిన హైక్రాస్ ఘటనకు E20 కారణం కాదన్న టయోటా

    ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన టయోటా Innova Hycross వీడియోతో Toyota కిర్లోస్కర్ మోటార్ కూడా E20 వివాదంలోకి వచ్చింది. E20 పెట్రోల్ వాడటం వల్లే వాహనంలో సమస్యలు వచ్చాయని ఆ వినియోగదారు ఆరోపించినట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిని టయోటా తీవ్రంగా ఖండించింది.

    Toyota E20 Statement

    మీడియాకు విడుదల చేసిన అధికారిక ప్రకటనలో... "ఈ ఘటనలో ఉన్న ఇన్నోవా హైక్రాస్ E20కు అనుకూలంగా రూపొందించబడింది. E20 పెట్రోల్‌తో ఉపయోగించేందుకు దీనిని డిజైన్ చేసి, పరీక్షించి, సంబంధిత అధికారుల నుంచి ధ్రువీకరణ కూడా పొందింది." అని టయోటా పేర్కొంది. ఈ ఘటన మరో ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తోంది. వాహనం పనితీరు లేదా మైలేజ్ ఒక్కసారిగా తగ్గితే, దానికి ఇంధన కలుషితమవడం కూడా ఒక కారణం కావచ్చని, చాలామంది ఈ అంశాన్ని పట్టించుకోరని ఈ ఉదాహరణ చెబుతోంది.

    కార్దెకో అభిప్రాయం...

    E20 పెట్రోల్‌పై వినియోగదారుల్లో ఉన్న ఆందోళనలు సహజమే. ఎందుకంటే మైలేజ్ నేరుగా వాహనం రన్నింగ్ ఖర్చుపై ప్రభావం చూపుతుంది. కేవలం వాహనం E20కు అనుకూలమని అధికారికంగా ప్రకటించారనే కారణంతో యజమానుల అనుభవాలను పూర్తిగా పక్కన పెట్టడం కూడా సరికాదు.

    అయితే మీ కారులో ఒక్కసారిగా పనితీరు లేదా మైలేజ్ గణనీయంగా తగ్గితే, దానికి వెంటనే E20నే కారణమని నిర్ణయించకూడదు. టైర్లలో గాలి ఒత్తిడి, ట్రాఫిక్ పరిస్థితులు, డ్రైవింగ్ తీరు, ఇంజిన్ సెన్సర్లు, ఫ్యూయల్ ఇంజెక్టర్లు, ఎయిర్-ఫ్యూయల్ మిశ్రమం, అలాగే టయోటా ఉదాహరణలో కనిపించినట్లుగా పెట్రోల్ బంకులో ఇంధనం కలుషితమవడం వంటి అంశాలను కూడా తప్పనిసరిగా పరిశీలించాలి. సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని పోస్టుల్లో చెప్పినట్లుగా, E20కు అనుకూలమైన వాహనాల్లో భారీ స్థాయిలో మైలేజ్ తగ్గుతుందని ఏ కార్ల తయారీ సంస్థ కూడా చెప్పడం లేదు.

    అసలు విషయం ఏమిటంటే... E20 ఇంధనం వల్ల మైలేజ్‌లో స్వల్ప ప్రభావం ఉండొచ్చు. కానీ ఒక్క రాత్రిలోనే మైలేజ్ భారీగా పడిపోతే, దానికి ఎథనాల్ మిశ్రమ ఇంధనాన్నే కారణంగా తేల్చేయకుండా, వాహనంపై సాంకేతికంగా సమగ్ర తనిఖీ చేయించుకోవడం అవసరం.

    was this article helpful ?

    tirth
    Tirth Pandya is a Senior Correspondent with the CarDekho Group and an automotive media professional with over 6 years of experience covering cars, EVs, and the ever-evolving world of mobility. An Automobile Engineering graduate, he specialises in automotive news, feature writing, launch coverage, and experiential storytelling. His love for machines began long before his professional career, fuelled by an enduring fascination with cars and even aeroplanes. Since entering the industry in 2020, he has spent countless hours on the road, chasing stories that take him from bustling city streets to remote off-road trails, always searching for the next great automotive experience. He combines technical expertise with a genuine passion for driving and exploration to bring readers engaging, insightful, and human-centric stories that capture not just the machines but also the emotions, adventures, and people behind them.ఇంకా చదవండి

    Write your వ్యాఖ్య

    ట్రెండింగ్‌లో ఉంది కార్లు

    • రాబోయేవి
    • పాపులర్
    *న్యూ ఢిల్లీ లో ఎక్స్-షోరూమ్ ధర
    ×
    మీ అనుభవాన్ని అనుకూలీకరించడానికి మాకు మీ నగరం అవసరం