• English
    • లాగిన్ / నమోదు

    E20 ఇంధనంపై ఆందోళనలు: SIAM లేఖను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో కార్ల యజమానులు నిజంగా తెలుసుకోవాల్సిన విషయాలు

    లీకైన SIAM లేఖతో E20 ఇంధనంపై ఆందోళనలు మొదలయ్యాయి. కానీ పరిశ్రమ సంస్థ, కేంద్ర ప్రభుత్వం, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం అసలు ఏమి చెబుతున్నాయి?

    tirth
    tirth
    Published On ఆగష్టు 06, 2026 17:10 ist
    info icon
    published onAug 06, 2026 17:10 IST
    last updated onAug 06, 2026 17:10 IST
    3 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    E20

    అసలు జరిగింది ఏమిటంటే... సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ పంపింది. ఆ లేఖలోని సమాచారం బయటకు రావడంతో E20 ఇంధనంపై చాలామంది కార్ల యజమానులు ఆందోళన చెందడం ప్రారంభించారు. అనంతరం SIAM కూడా స్పందించింది, అలాగే భారత పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ (MoPNG) కూడా వివరణ ఇచ్చింది. ఇప్పుడు అందరిలోనూ ఒకే ప్రశ్న ఉంది... ఇది కేవలం సాంకేతిక చర్చ మాత్రమేనా? లేక ఎథనాల్ కలిపిన పెట్రోల్‌లో నిజంగానే ఏదైనా సమస్య ఉందా? మీ కారు E20 ఇంధనాన్ని ఉపయోగిస్తే, అసలు నిజం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

    నివేదికల్లో ఏమి వెల్లడైంది?

    అన్నీ ఒక లీక్‌తో ప్రారంభమయ్యాయి. జూలై 28 తేదీతో SIAM ప్రభుత్వం‌కు పంపిన లేఖలోని కొంత భాగం అధికారికంగా విడుదల కాకముందే బయటకు వచ్చింది. ఆ లేఖలో E20 పెట్రోల్ (20 శాతం ఎథనాల్ + 80 శాతం సాధారణ పెట్రోల్) గురించి రెండు ప్రధాన అంశాలపై ఆందోళన వ్యక్తం చేసింది. మొదటిది... ఇంధనంలో క్లోరైడ్ (Chloride) కలవడం, రెండోది... ఇంధనంలో అధిక తేమ (Moisture) ఉండటం. ఈ రెండు సమస్యలు కొనసాగితే ఇంజిన్‌లో అత్యంత కీలకమైన కొన్ని భాగాలు దెబ్బతినే అవకాశం ఉందని లేఖలో పేర్కొంది. ముఖ్యంగా ఫ్యూయల్ ఇంజెక్టర్లు, ఫ్యూయల్ పంప్, ఎగ్జాస్ట్ గ్యాస్ రీసర్క్యులేషన్ (EGR) వాల్వ్ ప్రభావితమయ్యే అవకాశం ఉందని తెలిపింది.

    ఈ భాగాలు ఏమి చేస్తాయంటే... ఫ్యూయల్ ఇంజెక్టర్లు ఇంధనాన్ని ఇంజిన్‌లో సరిగ్గా స్ప్రే చేస్తాయి. అవి మూసుకుపోతే ఇంజిన్ మిస్‌ఫైర్ కావడం, పనితీరు తగ్గడం, మైలేజ్ పడిపోవడం జరుగుతుంది. ఫ్యూయల్ పంప్ ట్యాంక్ నుంచి ఇంజిన్‌కు ఇంధనాన్ని పంపుతుంది. అది తుప్పు పట్టినా లేదా దెబ్బతిన్నా ఇంధన సరఫరా ఆగిపోవచ్చు. కొన్ని సందర్భాల్లో వాహనం మధ్యలోనే ఆగిపోవచ్చు. EGR వాల్వ్ ఇంజిన్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అది సరిగా పనిచేయకపోతే కాలుష్య ప్రమాణాలు దాటిపోవడంతో పాటు ఇంజిన్ పనితీరుపైనా ప్రభావం పడుతుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఈ సమస్యలకు E20 ఇంధనమే కారణమని SIAM ఎక్కడా చెప్పలేదు. పాత నిల్వ ట్యాంకులు మరియు ఇంధన రవాణా వ్యవస్థలో ఉన్న లోపాలే దీనికి కారణమై ఉండొచ్చని మాత్రమే సూచించింది.

    SIAM ఏమి చెప్పింది?

    ఈ విషయం మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో SIAM వెంటనే వివరణ ఇచ్చి, జూలై 28న పంపిన లేఖను వెనక్కి తీసుకుంది. తమ వివరణలో... ఆ లేఖ అనేది కేవలం సాంకేతిక నిపుణుల మధ్య జరిగే సాధారణ చర్చలో భాగమే తప్ప, దేశవ్యాప్తంగా E20 ఇంధనంపై హెచ్చరిక జారీ చేయడానికి కాదని స్పష్టం చేసింది. మీడియాలో కొన్ని వాక్యాలను మాత్రమే తీసుకుని ప్రచారం చేయడం వల్ల ప్రజల్లో అపోహలు ఏర్పడ్డాయని SIAM పేర్కొంది. ఇంధనంలో క్లోరైడ్, తేమ లేదా భాగాలు దెబ్బతినే అంశాలపై దేశవ్యాప్తంగా సమగ్ర సమాచారం సేకరించిన తర్వాతే ఏదైనా నిర్ణయానికి రావాలని, ప్రస్తుతం వాటిపై ఖచ్చితమైన ఆధారాలు లేవని తెలిపింది. పూర్తి డేటా లేకుండానే నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదని పేర్కొంది.

    అలాగే ప్రస్తుతం ఇంధన నాణ్యతను నియంత్రించే కఠిన నిబంధనలు ఇప్పటికే అమల్లో ఉన్నాయని SIAM గుర్తు చేసింది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఎథనాల్‌లో క్లోరైడ్ మరియు సల్ఫర్ పరిమితిని 3 పార్ట్స్ పర్ మిలియన్ (ppm) గా నిర్ణయించిందని తెలిపింది. చమురు సంస్థలు కూడా ఇంధనం పంపుల వరకు చేరే ప్రతి దశలో అదనపు నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నాయని పేర్కొంది. అంతేకాకుండా E20 ఇంధన అమలుకు తాము ఇప్పటికీ పూర్తి మద్దతు ఇస్తున్నామని, ప్రభుత్వంతో జరిగిన అంతర్గత సాంకేతిక చర్చలో భాగంగానే ఆ లేఖ పంపించామని SIAM స్పష్టం చేసింది.

    ప్రభుత్వ స్పందన

    ఈ లీక్‌పై పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ (MoPNG) కూడా వెంటనే స్పందించింది. ప్రభుత్వం ప్రకారం... దేశంలో అమ్మకానికి వెళ్లే ప్రతి ఇంధన నమూనా 150కుపైగా నాణ్యత పరీక్షలు పూర్తి చేసిన తర్వాతే పంపులకు చేరుతుంది. ఆ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాతే వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని తెలిపింది.

    E20

    క్లోరైడ్ అంశంపై కూడా మంత్రిత్వ శాఖ స్పష్టమైన గణాంకాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 87,000 పెట్రోల్ బంకుల్లో కేవలం రెండు చోట్ల మాత్రమే క్లోరైడ్ సమస్య గుర్తించబడిందని తెలిపింది. దీనిని బట్టి దేశవ్యాప్తంగా E20 ఇంధనంలో సమస్య ఉందని చెప్పలేమని, ఇది చాలా అరుదుగా నమోదైన ఘటన మాత్రమేనని పేర్కొంది. తమ దేశవ్యాప్త పరీక్షల్లో SIAM ప్రస్తావించిన సమస్యలు విస్తృత స్థాయిలో కనిపించలేదని కూడా తెలిపింది.

    ప్రస్తుతం E20 ఇంధనం వాడుతున్న వారికి దీని అర్థం ఏమిటి?

    మొత్తం విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే... ఈ వివాదానికి కారణమైన జూలై 28 లేఖను SIAM ఇప్పటికే వెనక్కి తీసుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా E20 ఇంధనంలో పెద్ద సమస్య ఉందని నిర్ధారించే ఆధారాలు లేవు.

    SIAM కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. క్లోరైడ్, తేమ లేదా ఇంధన వ్యవస్థ భాగాలు దెబ్బతింటున్నాయనే అంశాలపై దేశవ్యాప్తంగా పూర్తి స్థాయి పరిశీలన ఇంకా జరగాల్సి ఉందని తెలిపింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నవి పూర్తిగా నిర్ధారిత సమాచారం కాదని పేర్కొంది.

    ఇక ప్రభుత్వం చెబుతున్నదేమిటంటే... ప్రతి ఇంధనం 150కుపైగా పరీక్షలు పూర్తి చేసిన తర్వాతే పంపులకు చేరుతుంది. అలాగే దేశంలోని సుమారు 87,000 పెట్రోల్ బంకుల్లో కేవలం రెండు చోట్ల మాత్రమే క్లోరైడ్ సమస్య గుర్తించబడిందని వెల్లడించింది. అయితే ప్రమాదం పూర్తిగా అసాధ్యం అని మాత్రం ప్రభుత్వం చెప్పలేదు.

    ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే... E20కి అనుకూలంగా తయారు చేయని పాత వాహనాల కోసం E10 లేదా E0 పెట్రోల్ అందుబాటులో కొనసాగడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు భావిస్తున్నారు.

    ● మీ కారు E20-రెడీ మోడల్ అయితే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి సాధారణంగానే E20 ఇంధనం ఉపయోగించవచ్చు. ప్రత్యేకంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

    ● మీ వాహనం E20కి అనుకూలంగా తయారు కాలేదంటే, E10 లేదా E0 పెట్రోల్ అందుబాటులో ఉండటం అవసరం. కాబట్టి E20 విస్తరిస్తున్నప్పటికీ పాత ఇంధన రకాలు కూడా కొనసాగాల్సిన అవసరం ఉంది.

    ఈ అంశంపై మరింత ధృవీకరించిన సమాచారం అందుబాటులోకి వచ్చిన కొద్దీ పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

    E20

    కార్దెకో అభిప్రాయం...

    జూలై 28న పంపిన లేఖను SIAM ఇప్పటికే వెనక్కి తీసుకుంది. మీడియాలో లేఖలోని కొంత భాగాన్నే ప్రచారం చేయడంతో అపోహలు ఏర్పడ్డాయని సంస్థ తెలిపింది. క్లోరైడ్, తేమ వంటి అంశాలపై పూర్తి స్థాయి పరిశీలన పూర్తయ్యే వరకు వాటిని దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలుగా భావించకూడదని పేర్కొంది.

    ఇక పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రకారం... ప్రతి ఇంధనం 150కుపైగా నాణ్యత పరీక్షలు పూర్తి చేసిన తర్వాతే అమ్మకానికి వస్తుంది. అలాగే సుమారు 87,000 పెట్రోల్ బంకుల్లో కేవలం రెండు చోట్ల మాత్రమే క్లోరైడ్ సమస్య నమోదైందని తెలిపింది.

    మీ వద్ద E20-రెడీ కారు ఉంటే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పరిశ్రమ మొత్తం E20 అమలుకు మద్దతుగా ఉంది. అలాగే ఎథనాల్‌లో క్లోరైడ్, సల్ఫర్ పరిమితిని 3 ppmగా నిర్ణయించిన నాణ్యత ప్రమాణాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి.

    అయితే పాత, E20కి అనుకూలం కాని వాహనాల యజమానుల కోసం E10 మరియు E0 ఇంధనాలు కూడా అందుబాటులో కొనసాగాలి, తద్వారా వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుంది.

    ఈ అంశంపై అధికారికంగా మరింత ధృవీకరించిన సమాచారం అందుబాటులోకి వచ్చిన వెంటనే పూర్తి వివరాలు తెలియజేస్తాం. మీ వద్ద పాత, E20కి అనుకూలం కాని కారు ఉందా? మీ కారుకు వస్తున్న మైలేజ్ ఎంత? కామెంట్లలో తెలియజేయండి.

    was this article helpful ?

    tirth
    Tirth Pandya is a Senior Correspondent with the CarDekho Group and an automotive media professional with over 6 years of experience covering cars, EVs, and the ever-evolving world of mobility. An Automobile Engineering graduate, he specialises in automotive news, feature writing, launch coverage, and experiential storytelling. His love for machines began long before his professional career, fuelled by an enduring fascination with cars and even aeroplanes. Since entering the industry in 2020, he has spent countless hours on the road, chasing stories that take him from bustling city streets to remote off-road trails, always searching for the next great automotive experience. He combines technical expertise with a genuine passion for driving and exploration to bring readers engaging, insightful, and human-centric stories that capture not just the machines but also the emotions, adventures, and people behind them.ఇంకా చదవండి

    కార్ వార్తలు

    ట్రెండింగ్‌లో ఉంది కార్లు

    • రాబోయేవి
    • పాపులర్
    *న్యూ ఢిల్లీ లో ఎక్స్-షోరూమ్ ధర
    ×
    మీ అనుభవాన్ని అనుకూలీకరించడానికి మాకు మీ నగరం అవసరం