• English
    • లాగిన్ / నమోదు

    వారాంతపు విశేషాలు: మహీంద్రా KUV100 బహిర్గతం, సుప్రీం కోర్ట్ ఢిల్లీలో డీజిల్ కార్లు నిషేదించింది మరియు చెన్నై లో డాట్సన్ గో రహస్యంగా కనిపించింది

    ఈ వారం డీజిల్ కార్ల నమోదు "నిషేధం" తో దేశ రాజధాని డిల్లీ ఈ వారం ముఖ్యాంశాలు ఆధిపత్యంగా ఉంది. సుప్రీం కోర్ట్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా మెరుగైన మార్గంలో అనుసరించబడి మరియు 2,000 సిసి ఇంజిన్ సామర్థ్యం గల డీజిల్ కార్ల రిజిస్ట్రేషన్ నిషేధించింది. అది కాకుండా, హోండా జాజ్ క్రాస్ఓవర్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్, ఫోర్డ్ ఎండీవర్ మరియు డాట్సన్ రెడీ గో వంటి కార్ల వలే చాలా కార్లు ఈ వారం రహస్యంగా కనిపించాయి. అంతేకాకుండా మహీంద్రా పినిన్ఫారిన తో ముడిపడింది మరియు దాని కారు KUV100 ప్రత్యేకతల ఊహాగానాలు వెల్లడయ్యాయి. ఈ వారం జరిగిన మరిన్ని విశేషాలను చూద్దాం పదండి!!!

    sumit
    sumit
    Published On డిసెంబర్ 21, 2015 18:05 ist
    info icon
    published onDec 21, 2015 18:05 IST
    last updated onDec 21, 2015 18:05 IST
    24 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    జైపూర్:

    ఢిల్లీలో నిషేధించబడిన 2-లీటర్ లేదా పెద్ద ఇంజిన్ డీజిల్ కార్లు

    జైపూర్: భారతదేశం యొక్క సుప్రీం కోర్ట్ 3 నెలల వరకు ఢిల్లీలో 2-లీటర్ల లేదా పెద్ద యంత్రాలతో ఉన్న అన్ని డీజిల్ కార్ల అమ్మకాలు నిషేందించింది! ఢిల్లీ ఈ రోజుల్లో ఆటోమేటివ్ పరిశ్రమ కోసం ఒక హాట్ స్పాట్ గా ఉంది. ఇదంతా కూడా ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించిన ఆడ్-ఈవెన్ కార్లను నిషేందించడం వలన వచ్చింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బేసి సంఖ్య రిజిస్ట్రేషన్ గల కారు సోమవారం, బుధవారం మరియు శుక్రవారం రోడ్లపై అనుమతించబడతాయి మరియు సరి సంఖ్య రిజిస్ట్రేషన్ గల కార్లు మంగళవారం, గురువారం మరియు శనివారం అనుమతించబడతాయి. ఇది వాహనం నడిపే వారికి మరియు మోటార్ వాహన తయారీదారులకు ఒక పెద్ద అడ్డంకి అని చెప్పాలి. ఎందుకంటే వాహనాలను వారంలో కొద్ది రోజులు మాత్రమే నడపడం ఒక సమస్య. అధనంగా NGTవారు డీజిల్ వాహన రిజిస్ట్రేషన్ ను డిసెంబర్ 11 2015 నుండి జనవరి 6 2016 నిలిపి వేశారు. ఇంతేకాకుండా ఇటీవల సుప్రీం కోర్ట్ ఇండియా వారి ఇటీవలి నిర్దేశకాల ప్రకారం డీజిల్ ఇంజిన్ వాహనాల అమ్మకాల పైన కూడా బాన్ విధించడం జరిగింది. ఇది 2 లీటర్ లేదా అంతకు పైన సామర్ధ్యం ఉన్న డీజిల్ ఇంజిన్లకు వర్తిస్తుంది. ముఖ్యంగా ఇది NCR పరిధిలో జనవరి 1,2016 నుండి మూడు నెలలు వర్తింపులో ఉంటుంది. ఇంకా చదవండి

    మహీంద్రా పొందిన ఇటాలియన్ డిజైన్ పినిన్ఫారిన

    జైపూర్:మహీంద్రా & మహీంద్రా(M&M) మరియు టెక్ మహీంద్రా వారు సమ్యుక్తంగా ఇటాలియన్ డిజైన్ హౌస్ వారి పినిన్ఫారిన ను ముందుకు తీసుకొచ్చారు. వీరిరువురి యొక్క ప్రపంచ విలువ 16.9 బిలియన్ డాలర్స్ మహీంద్రా గ్రూప్ కి చెందబడి ఉంది. మహీంద్రా వారు ఇప్పుడు ఈ అందుబాటు ద్వారా 85 యేళ్ళ పేరున్న ఫెరారీ కారుని, ఆల్ఫా రోమియో, మసెరాటి మరియు ప్యోగెట్ వాహనాల డిజైన్ సంస్థలో భాగం పొందగలిగారు. ఇంకా చదవండి 

    S-క్రాస్ - మారుతి యొక్క ఇంతకంటే అద్భుతమైన వాహనం ఏది?

    జైపూర్: ఈ వాహనం ఆగస్టు 05, 2015 న ప్రారంభించబడింది మరియు క్రెటా వాహనానికి పోటీ అని భావించబడింది. ఈ కారు ప్రారంభమయ్యే వరకూ. అంతేకాకుండా కారు ఇప్పటికే హైప్ ఉత్పత్తిని మరింత పేరుని పొందేలా నెక్సా డీలర్‌షిప్ ద్వారా అమ్మకాలకు వెళ్ళింది. అందరు మారుతి ప్రేమికులు ఈ కారు ని ఎంతగానో ఆదర్శిస్తున్నారు మరియు ఆఫ్ రోడింగ్ కావాలనుకునేవారికి ఇది సమర్ధవంతమైన వాహనం. ఈ వాహనన్ని కావలనుకోడానికి ముఖ్య కారణం ఇది బలమైన కస్టమర్ బేస్ ని కలిగి ఉండడం మరియు శక్తివంతమైన ఇంజిన్ ని కలిగి ఉండడం. అయితే, ఈ కారుతో మారుతి కి ప్రీమియం అనే పేరు రాకపోవడానికి గల కారణాలు ఏమిటి?  ఇంకా చదవండి 

    షెవ్రొలె వారు బీట్ యొక్క 1,01,597 యూనిట్లను వెనక్కి తీసుకున్నారు

    జైపూర్: షెవ్రొలె ఇండియా వారు వారి యొక్క 1,01,597 బీట్ డీజిల్ హ్యాచ్‌బ్యాక్ వాహనాలను వెనక్కి తీసుకోబోతున్నారు. జనరల్ మోటార్స్ వారి నిన్నటి ఒక ప్రటన ప్రకారం ఈ వాహనంలోని క్లచ్ పెడల్ లీవర్ లో సమస్య కారణం అని తెలియవచ్చింది. ఈ షెవ్రొలె బీట్ వాహనం డిసెంబర్ 2010 మరియు జులై 2014 మధ్య తయారుచేయబడి మార్కెట్ లోనికి వచ్చింది. ఇప్పుడు ఈ వాహనాలను వెనక్కి తీసుకొనే క్రమంలో వాహన యజమానులకు సమాచారాన్ని అందిస్తున్నారు. వినియోగదారులు వారి వాహనాలను షెవ్రొలే వారి A 2048 సేవా సెంటర్లలోకైనా తీసుకు వెళ్ళవచ్చు. సంస్థ వారు అక్కడ వాహనాలను పరీక్షించి ఈ క్లచ్ పెడల్ లీవర్ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా బీట్ యజామనులు సంస్థ వారి ఏ డీలర్ వద్దకైనా వెళ్ళి వారి వాహన ఇన్స్పెక్షన్ గురించి నమోదు చేసుకోవచ్చు. ఇంకా చదవండి 

    జనవరి 2016 నాటికి బాలెనో ని జపాన్ కి ఎగుమతి చేయనున్న భారత్

    జైపూర్:భారత ప్రధాని నరేంద్ర మోడి వెల్లడి ప్రకారం భారతీయ తయారీ కార్లు త్వరలో జపాన్ కు ఎగుమతి కానున్నాయి. ఈ వాహనాలు మారుతి సుజికి ద్వారా తయారుచేయబడి జపాన్ కు ఎగుమతి కాబడుతున్న మొట్టమొదటి శ్రేణి. ఇంకా చదవండి

    2016 నుండి 3% ధరల పెంపు ని ప్రకటించిన స్కోడా, నిస్సాన్ మరియు డాట్సన్

    జైపూర్: నిస్సాన్, డాట్సన్ మరియు స్కోడా కొత్త సంవత్సరంలో తమ ఉత్పత్తుల ధరను పెంచుకుంటున్నాయి. ఈ ధరల పెంపు వివిధ మోడళ్లకు 1 నుండి 3 శాతం వరకు మారుతూ ఉంటుంది. నిస్సాన్ మరియు డాట్సన్ ఉత్పత్తులు 1 నుండి 3 శాతం వరకూ ఉంటుంది మరియు స్కోడా కార్లు 2 నుండి 3 శాతం వరకూ పెంపు ఎదుర్కొంటుంది. గతంలో, మారుతి, టయోటా, హ్యుండాయ్, మెర్సిడెస్ బెంజ్ మరియు BMW కూడా 2016 నుండి ధరల పెంపు ప్రకటించారు. చాలా బ్రాండ్స్ 'రైజింగ్ ఇన్‌పుట్ కాస్ట్' అనే కాన్సెప్ట్ తో వస్తున్నాయి. కొత్త ధరల పెంపు జనవరి 1, 2016 నుండి అమలులోకి వస్తాయి. మోడల్ మరియు వేరియంట్ ఆధారంగా ధర రూ. 14,000 నుండి 15,000 పెరిగే అవకాశం ఉంది. నిస్సాన్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మల్హోత్రా ఈ " ధరలు యొక్క పెరుగుదల నెగిటివ్ ఇంపాక్ట్ ని సాఫ్ట్ గా చేస్తాయి మరియు కంపెనీ పోటీగా ఉండడానికి సహాయం చేస్తాయి. ఇంకా చదవండి

    డాట్సన్ రెడిగో చెన్నై లో మళ్ళీ పట్టుబడింది

    జైపూర్ : "డాట్సన్ రెడిగో " చెన్నై లో మళ్ళీ రహస్యంగా పట్టుబడింది.. ఈ కారు యొక్క ముందు మరియు వెనుక భాగాలు ఇంతకు ముందే నవంబర్లో కెమెరాలో బంధించారు. మొదటిసారి 2014 ఆటో ఎక్స్పోలో,ఈ కారు ఎంట్రీ స్థాయి విభాగంలో ప్రారంబించబడింది. ఇది మారుతీ 800 ని కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రత్యామ్నాయంగా ప్రదర్శించబడింది. ఇంకా చదవండి

    was this article helpful ?

    sumit
    <p><span>The latest addition to our CarDekho Team, Sumit is an automobile fanatic who keeps in good touch with recent developments in the automobile sector. His passion for vehicles forced him to write a research paper on the recent development in the field and initiate an automobile club in his university. By joining CarDekho, he is able to converge his passion and profession successfully.</span></p>ఇంకా చదవండి

    Write your వ్యాఖ్య

    ట్రెండింగ్‌లో ఉంది కార్లు

    • రాబోయేవి
    • పాపులర్
    *న్యూ ఢిల్లీ లో ఎక్స్-షోరూమ్ ధర
    ×
    మీ అనుభవాన్ని అనుకూలీకరించడానికి మాకు మీ నగరం అవసరం